Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Chintalapudi: “లక్కవరం జడ్పీ విద్యార్థినికి జాతీయ స్థాయి గుర్తింపు – ఎమ్మెల్యే రోశన్ ఆర్థిక సహాయం, అభినందనలు”

    2 months ago

    చింతలపూడి ఎమ్మెల్యే రోశన్ కుమార్ లక్కవరం జడ్పీ హైస్కూల్ విద్యార్థిని కాసరపు జాహ్నవిని రాష్ట్ర స్థాయి చిత్రలేఖన పోటీలో ద్వితీయ బహుమతి సాధించి, ఢిల్లీలో జరుగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన సందర్భంగా అభినందించి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు దుర్గారావు విద్యార్థినిచే సాధించిన ప్రతిభను ఎమ్మెల్యేకు వివరించారు. అలాగే 2019లో ఇదే పాఠశాల విద్యార్థిని బాసి సంధ్యకు ఎమ్మెల్యే చేసిన సహాయాన్ని జాహ్నవి గుర్తు చేసుకుంటూ, ఆ ప్రోత్సాహం తన చదువుల పురోగతికి ఉపయోగపడ్డదని తెలిపింది.

    విద్యార్థినిల సహజ ప్రతిభను గమనించిన ఎమ్మెల్యే మరింత ప్రోత్సాహాన్ని ప్రకటించారు. హైస్కూల్ డ్రాయింగ్ టీచర్ మనోహర్ ఎమ్మెల్యే చిత్రపటాన్ని డ్రాయింగ్ రూపంలో తయారు చేసి బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి చైర్మన్ దల్లి దుర్గారెడ్డి, కొదమ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

    Click here to Read More
    Previous Article
    Janasena: జనసేన కమిటీల నిర్మాణం, కూర్పుపై కసరత్తు
    Next Article
    ₹23 కోట్ల మోసం కేసులో ప్రధాన నిందితుడు ఉప్పల సతీష్ ముంబైలో అరెస్ట్ — ఎస్‌ఐ శ్రీకాంత్ గౌడ్ పాత్రపై పెద్ద సంచలనం

    Related ఆంధ్రప్రదేశ్ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment