Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    Gudivada: రైల్వే గేట్లపై ఆర్.ఓ.బి. నిర్మాణానికి రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

    2 months ago

    గుడివాడ, నవంబర్ 20:
    గుడివాడ పట్టణంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (ROB) నిర్మాణ పనులు వేగవంతం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల పనులు ఆలస్యం అయినప్పటికీ, కీలకమైన రైల్వే శాఖ అనుమతులు ప్రస్తుతం మంజూరైనట్లు రాము వెల్లడించారు.

    రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనుల పురోగతిని ఎన్‌.హెచ్‌.ఎ అధికారులతో గురువారం సాయంత్రం ప్రజా వేదిక కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే రాము సమీక్షించారు. ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు.

    మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే రాము—

    • రైల్వే శాఖ సాంకేతిక అనుమతులు ఆలస్యం కావడంతోనే ROB పనుల్లో అవాంతరాలు ఏర్పడ్డాయని,
    • భీమవరం, మచిలీపట్నం రైల్వే గేట్లపై ROB నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించిందని,
    • కల్వర్టులు, OHC పోల్స్, SND కేబుల్స్ వంటి పనుల కోసం రైల్వే శాఖకు ఎన్‌.హెచ్‌.ఏ ద్వారా రూ. 8 కోట్లు చెల్లించామని తెలిపారు.

    గుడివాడ MP వల్లభనేని బాలసౌరి ఈ ప్రాజెక్టుకు ప్రత్యేకంగా ఫాలో-అప్ చేస్తూ, ఢిల్లీ స్థాయి రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడి పనులు త్వరగా పూర్తయ్యేలా కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే రాము అన్నారు.

     

    ఈ సమావేశంలో ఎన్‌.హెచ్‌.ఏ D.E సత్యనారాయణ, A.E శరత్ చంద్ర, మున్సిపల్ M.E ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

    Click here to Read More
    Previous Article
    PM Modi : బిహార్‌లో ఎన్డీయే విజయోత్సాహం మధ్య ప్రధాని మోదీ ‘గంచా మూమెంట్’తో సోషల్ మీడియాలో వైరల్
    Next Article
    Sabarimala Gold Case : శబరిమల బంగారు తాపడం చోరీ కేసులో మరో పెద్ద అరెస్ట్— మాజీ ట్రావెన్‌కోర్ బోర్డు చైర్మన్ పద్మకుమార్

    Related ఆంధ్రప్రదేశ్ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment